వైసీపీ అరాచకాలు ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలి: నల్లారి కిషోర్

వైసీపీ అరాచకాలు ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలి: నల్లారి కిషోర్
ప్రజల నుంచి దోచుకున్న సొమ్మునే.. నవరత్నాల పేరుతో తిరిగి ఇస్తున్నారని విమర్శించారు. ప్రజల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా టీడీపీ గ్యారెంటీ పథకాలు ఉన్నాయన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్‌ రెడ్డి. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మునే.. నవరత్నాల పేరుతో తిరిగి ఇస్తున్నారని విమర్శించారు. ప్రజల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా టీడీపీ గ్యారెంటీ పథకాలు ఉన్నాయన్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని కోరారు. పీలేరులో నూనె గింజల ఫ్యాక్టరీ భూములను వైసీపీ నాయకులు ఆక్రమించి రియల్ ఎస్టేట్‌ దందా చేస్తున్నారని మండిపడ్డారు. భూఅక్రమాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు.. వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story