pawan kalyan : కౌలు రైతులకోసం పవన్ భరోసా యాత్ర.. బాధిత కుటుంబానికి లక్షరూపాయల చెక్కు

pawan kalyan :  కౌలు రైతులకోసం పవన్ భరోసా యాత్ర.. బాధిత కుటుంబానికి లక్షరూపాయల చెక్కు
pawan kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేపట్టిన కౌలురైతు భరోసా యాత్ర కొనసాగుతోంది.

pawan kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేపట్టిన కౌలురైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కొత్తచెరువులో బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు లక్షరూపాయల చెక్కును అందజేశారు. ఈసందర్బంగా వారి కుటుంబ పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాల వల్లే కౌలు రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలతోపాటు.. పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కొత్తచెరువులో బాధితుల పరామర్శ అనంతరం పవన్ కల్యాణ్‌.. ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామం చేరుకుంటారు. అక్కడ కౌలురైతు కుటుంబాన్ని పరామర్శించా వారికి ఆర్ధిక సహాయం చేస్తారు. ఆ తర్వాత అనంతపురం రూరల్‌ మండలం పూలకుంట, మన్నీల గ్రామంలో పర్యటిస్తారు. ఈ అన్ని చోట్ల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. లక్ష రూపాలయ చొప్పున చెక్కులను అందించనున్నారు. ఈ పరామర్శల తర్వాత మన్నీల గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రసంగిస్తారు.

అయితే ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను జనసేన యంత్రాంగం ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. ఆ సమాచారం ప్రకారమే ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్‌ కల్యాణ్‌ కలుసుకొని ఆర్ధిక సహాయం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు జనసేన తెలిపింది. ఇందుకుగాను బాధిత కుటుంబాలకు 5 కోట్లు పార్టీతరుపున విరాళం కూడా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story