హైకోర్టులో రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఊరట..!
By - TV5 Digital Team |13 Dec 2021 9:49 AM GMT
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నిధుల మళ్లింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఊరట లభించింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నిధుల మళ్లింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఊరట లభించింది.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ కేసులో లక్ష్మీనారాయణ ఏ-2గా ఉన్నారు.. ముందస్తు బెయిల్ రావడంతో లక్ష్మీనారాయణకు ఊరట లభించినట్లయింది.. ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా వున్న ఘంటా సుబ్బారావును సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com