ఘోర రోడ్డుప్రమాదం.. పెళ్లి బృందం వ్యాన్ బోల్తా.. ఆరుగురు మృతి
BY Nagesh Swarna30 Oct 2020 1:06 AM GMT

X
Nagesh Swarna30 Oct 2020 1:06 AM GMT
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి కొండపైనుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే చనిపోగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోకవరం మండలం తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో.. కొండపైనుంచి వ్యాన్ కిందకు పడిపోయింది. మృతులంతా.. గోకవరం మండలం ఠాకూరుపాలెం గ్రామానికి చెందిన పెళ్లి బృందంగా గుర్తించారు. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
Next Story
RELATED STORIES
Priyanka Jawalkar : బద్దకంగా ఉందంటూ హాట్ ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక..!
21 May 2022 2:00 AM GMTSai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్కమింగ్ మూవీ అప్డేట్...
9 May 2022 7:00 AM GMTAnasuya Bharadwaj : 'నా కోసం నేను చేస్తాను'.. అనసూయ కొత్త ఫోటోలు...
21 April 2022 1:46 PM GMTMahesh Babu: గ్రాండ్గా మహేశ్ బాబు తల్లి పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు...
20 April 2022 11:30 AM GMTPujita Ponnada : వైట్ శారీలో పూజిత.. కొత్త ఫోటోలు అదుర్స్..!
20 April 2022 7:15 AM GMTEesha Rebba: ఆ యంగ్ హీరోతో సినిమా క్యాన్సిల్ అయ్యింది: ఈషా రెబ్బా
19 April 2022 3:30 PM GMT