జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం!

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం!
త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది.

ఏపీలో ప్రాదేశిక ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. గత ఏడాది మధ్యలో ఆగిన ప్రక్రియను కొనసాగించాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ.. ఈ మేరకు కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నీని కలిసి.. కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరింది. గతంలో నిమ్మగడ్డ ఉన్నప్పుడే అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని.. రానున్న ఎన్నికలు కూడా ఏకపక్షంగానే జరుగుతాయని టీడీపీ విమర్శిస్తోంది.




Tags

Read MoreRead Less
Next Story