టీడీపీ బాపట్ల పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా సాంబశివరావు ప్రమాణస్వీకారం

టీడీపీ బాపట్ల పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా సాంబశివరావు ప్రమాణస్వీకారం
గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఏలూరి సాంబశివరావు ప్రమాణస్వీకారం చేశారు.. ఏలూరి సాంబశివరావుతోపాటు బాపట్ల పార్లమెంటు..

గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఏలూరి సాంబశివరావు ప్రమాణస్వీకారం చేశారు.. ఏలూరి సాంబశివరావుతోపాటు బాపట్ల పార్లమెంటు అధ్యక్షురాలిగా పృథ్వి లత, కార్యదర్శిగా సరోజిని ప్రమాణం చేశారు చేశారు.. ఏలూరి సాంబశివరావుతో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాణం చేయించారు.. బాపట్లలోని ఎంఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.

బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధిష్ఠానానికి ఏలూరి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. వైసీపీ అరాచకాలను గట్టిగా ఎదిరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీకి కార్యకర్తలే బలమని మాజీ మంత్రులు అన్నారు.. ఎన్ని కేసులు పెట్టి వేధించినా భయపడబోమని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story