విజయనగరంలో టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

విజయనగరంలో టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

విజయనగరంలోని సారిపల్లిలో టీడీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నా ఇల్లు నా సొంతం- నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.. విజయనగరంలో ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సారిపల్లిలో ఎన్టీఆర్‌ గృహాలను పరిశీలించేందుకు టీడీపీ నేతలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అనుమతి లేదంటూ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు అక్కడ్నుంచి తప్పించుకుని ఇళ్ల వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.


Tags

Read MoreRead Less
Next Story