విజయనగరంలో టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
By - Nagesh Swarna |6 Nov 2020 10:37 AM GMT
విజయనగరంలోని సారిపల్లిలో టీడీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నా ఇల్లు నా సొంతం- నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.. విజయనగరంలో ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సారిపల్లిలో ఎన్టీఆర్ గృహాలను పరిశీలించేందుకు టీడీపీ నేతలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అనుమతి లేదంటూ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు అక్కడ్నుంచి తప్పించుకుని ఇళ్ల వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com