AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. పెగాసస్‌పై చర్చ సందర్భంగా..

AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. పెగాసస్‌పై చర్చ సందర్భంగా.....స్పీకర్‌ పొడియంను చుట్టుముట్టి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. డేటా చౌర్యంపై ఏపీ అసెంబ్లీలో హౌస్‌ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. 2016 నుంచి 19 మధ్య డేటా చౌర్యం జరిగినట్లు భూమన నేతృత్వంలోని కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఐతే నివేదికపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికను తమకు ఇచ్చిన తర్వాతే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ పొడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్‌.

Tags

Read MoreRead Less
Next Story