ఆరుద్ర కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ

ఆరుద్ర కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ
కాకినాడ ఆరుద్ర కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్‌కు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత లేఖ రాశారు.

కాకినాడ ఆరుద్ర కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్‌కు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత లేఖ రాశారు. కాకినాడలో ఆరుద్ర అనే మహిళను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని లేఖలో ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో ఉన్న కుమార్తెకు వైద్యం అందించేందుకు ఇల్లును అమ్మునీయకుండా కానిస్టేబుళ్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆరుద్ర విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఆమెమానసికస్థితి సరిగా లేదని ఆస్పత్రికి పంపారని మండిపడ్డారు. గతంలో డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడిగా ముద్ర వేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆరుద్రను పిచ్చిదానిగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. బాధితురాలికి జాతీయ మహిళా కమిషన్ న్యాయం చేయాలని ఆమె కుమార్తెకు ట్రీట్‌మెంట్‌ అందేలా చూడాలని అనిత కోరారు.

Tags

Read MoreRead Less
Next Story