TTD EO: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు.. వచ్చే నెలలో పెళ్లి

TTD EO: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు.. వచ్చే నెలలో పెళ్లి
TTD EO: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి(శివ)(28) గుండెపోటుకు గురయ్యారు.

TTD EO: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి(శివ)(28) గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం జనవరిలో తిరుమలలో జరగనుంది. చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలో ఇరు కుటుంబాలు పెళ్లి కార్యక్రమాల్లో ఉన్నారు. చెన్నైలోని ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వానపత్రికలు ఇచ్చేందుకు చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. అయితే కొద్దిసేపటికి అతడు గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో.. పక్కనే ఉన్న స్నేహితుడు వెంటనే సమీపంలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ విషయం తెలుసుకున్న కాబోయే మామగారు శేఖర్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ధర్మారెడ్డి దంపతులు కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెన్నై కావేరి ఆస్పత్రికి వెళ్లారు. పెళ్లికి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళుతుండగా చంద్రమౌళికి గుండెపోటు వచ్చిందని, వెంటనే కావేరీ ఆస్పత్రిలో చేర్చారని ధర్మారెడ్డి కుటుంబ సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం చంద్రమౌళి చికిత్స పొందుతున్నారని, నెమ్మదిగా కోలుకుంటున్నారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story