తిరుపతిలో వింత ఘటన .. భూమిలోంచి పైకి వచ్చిన 25 అడుగుల వాటర్ ట్యాంక్
By - TV5 Digital Team |26 Nov 2021 8:15 AM GMT
Tirupati : భారీ వర్షాల ధాటికి తిరుపతి శ్రీకృష్ణానగర్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Tirupati : భారీ వర్షాల ధాటికి తిరుపతి శ్రీకృష్ణానగర్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భూమిలోంచి 25 అడుగుల తాగునీటి వాటర్ ట్యాంక్ అమాంతం పైకి వచ్చింది. 18 సిమెంట్ ఒరలతో భూమిలో నిర్మించిన ఈ వాటర్ ట్యాంక్ బయటకు రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓ మహిళ ట్యాంక్ లోపలికి దిగి శుభ్రం చేస్తుండగానే అది బయటకు వచ్చింది.. స్వల్ప గాయాలతో ఆ మహిళ ట్యాంక్ నుంచి బయట పడింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com