GVL Narasimharao: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించడంలేదు: జీవీఎల్
By - Prasanna |25 Nov 2021 11:25 AM GMT
GVL Narasimharao: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ వేసినట్లు తెలిపారు.
GVL Narasimharao: వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారన్నారు. సీఎం జగన్ లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ వేసినట్లు తెలిపారు. రేపు ఈ కమిటీ.. ఏపీకి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆయన తెలిపారు. కానీ సీఎం జగన్... వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడంలేదని జీవీఎల్ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com