SHARMILA: జగన్‌ ఇంత దిగజారుతాడు అనుకోలేదు

SHARMILA: జగన్‌ ఇంత దిగజారుతాడు అనుకోలేదు
వివేకానందరెడ్డికి న్యాయం జరగలేదన్న షర్మిల.... జగనన్న మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని హితవు

ఐదేళ్లుగా వివేకానందరెడ్డికి న్యాయం జరగలేదనే ఆవేదన తనలో ఉందని వైఎస్‌ షర్మిల అన్నారు. జగన్ ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదన్న ఆమె.... అద్దం ముందు నిల్చొని తన మనస్సాక్షిని తాను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. వివేకా మరణంతో బాధితులైన తన చిన్నమ్మ, సునీతకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా... వారిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. ‘‘హంతకులు ఎవరో కాదు.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా?ఇవాళ్టి వరకు హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైకాపా కోసమే పనిచేశారు. సాక్షిలో పైన వైఎస్‌ ఫొటో.. కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా?ఆయన వారసుడిగా మీరేం చేశారు?’’ అని షర్మిల నిలదీశారు.


మరోవైపు తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్నవాళ్లు మరోవైపు ఉన్నారని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హత్యచేసింది బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నా... ఐదేళ్లుగా వారికి శిక్షపడలేదని వాపోయారు. అండగా ఉండాల్సిన అన్నే హంతకులకు కొమ్ముకాస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను సూటిగా విమర్శించారు. తన తండ్రిని చంపినవారికి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని వివేకా కుమార్తె సునీత ప్రజలకు పిలుపునిచ్చారు. వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో జరిగిన జ్ఞాపకార్థ సభలో కుటుంబ సభ్యులతో పాటు పలు పార్టీల నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. వివేకాను చంపిన వాళ్లను వదిలేసి తమపైనే నిందలు వేయడం.. ఎంత వరకు సమంజసమని జగన్‌ను ప్రశ్నించారు. మా అన్న పార్టీకి ఓటు వేయవద్దన్న సునీత... అన్నం పెట్టిన చేతిని నరకడం, ఆయన వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.


వైసీపీ పునాదులు వివేకా రక్తంపై ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లుగా వివేకానందరెడ్డికి న్యాయం జరగలేదనే ఆవేదన తనలో ఉందని వైఎస్‌ షర్మిల అన్నారు. జగన్ ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదన్న ఆమె... అద్దం ముందు నిల్చొని తన మనస్సాక్షిని తాను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. వివేకా మరణంతో బాధితులైన తన చిన్నమ్మ, సునీతకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా... వారిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. సునీత కుటుంబానికి సంఘీభావం తెలిపిన వివిధ పార్టీలు ఆమె న్యాయపోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జ్ఞాపకార్థ సభకు హాజరైన పలువురు స్థానిక నేతలు వివేకా చిత్రపటానికి నివాళులర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story