దుర్గ గుడి కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల సమావేశం.. బొండా ఉమ ఫైర్
By - kasi |6 Nov 2020 7:03 AM GMT
విజయవాడ దుర్గ గుడి కార్యాలయంలో.. మంత్రి వెల్లంపల్లి వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల సమావేశం నిర్వహించడంపై... టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ ఫైర్ అయ్యారు. మంత్రి సెల్ నుంచే సమావేశానికి రావాల్సిందిగా SMSలు వెళ్లడంతో 64 మంది వైసీపీ అభ్యర్థులు వెళ్లారని మండిపడ్డారు. తక్షణమే మంత్రిని సస్పెండ్ చేయాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు... ఇప్పుడు వైసీపీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు బొండా ఉమ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com