వైసీపీ నేతల అరాచకాలు.. చనిపోయిన వారిపేర్లతో ఓటర్‌ స్లిప్పులిచ్చి రిగ్గింగ్‌?

వైసీపీ నేతల అరాచకాలు.. చనిపోయిన వారిపేర్లతో ఓటర్‌ స్లిప్పులిచ్చి రిగ్గింగ్‌?
చనిపోయిన వారి పేర్లతో ఓటర్‌ స్లిప్పులు ఇచ్చి రిగ్గింగ్‌కు పాల్పడిన ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో... వైసీపీ నేతల అరాచకాలపై మండిపడుతున్నాయి టీడీపీ శ్రేణులు. చనిపోయిన వారి పేర్లతో ఓటర్‌ స్లిప్పులు ఇచ్చి రిగ్గింగ్‌కు పాల్పడిన ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటన 68 వ వార్డులో జరిగినట్లు టీడీపీ మహిళా అభ్యర్ధి అనంతలక్ష్మి ఆధారాలతో సహా బైటపడ్డారు. అకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌ దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారంటూ మండిపడ్డారు. 9 నుంచి 14వ నెంబర్‌ బూతులతో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారన్నారు. 68వార్డులోని ఆరు బూతుల్లో రీపోలింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story