YS Jagan: మోదీకి జగన్ లేఖ.. వెయ్యి కోట్లు సాయం కోరుతూ..

YS Jagan (tv5news.in)

YS Jagan (tv5news.in)

YS Jagan: ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోదీకి లేఖ రాశారు.

YS Jagan: ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారీ వర్షాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలన్నారు. నాలుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని.. తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేట వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలకు నీట మునిగాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం జరిగిందని.. 196 మండలాలు నీట మునిగాయని వివరించారు. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాలువలు కోతకు గురయ్యాయని లేఖలో పేర్కొన్నారు. చెరువులకు గండ్లు పడటం ద్వారా చాలా ప్రాంతాలు నీట మునిగాయని.. తక్షణం వెయ్యి కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని విన్నవించారు.

Tags

Read MoreRead Less
Next Story