ఏపీలో జియోకి సాయపడనున్న ఎయిర్‌టెల్

ఏపీలో జియోకి సాయపడనున్న ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ తనకి కేటాయించిన 800మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ని మూడు సర్కిల్స్‌లో జియోకి బదిలీ చేయనుంది

టెల్కో కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ యూజర్ల పరంగా వ్యాపారపరంగా ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే, అయితే ఎయిర్‌టెల్ తనకి కేటాయించిన 800మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ని మూడు సర్కిల్స్‌లో జియోకి బదిలీ చేయబోతోంది. ఇది ఓ రకంగా సాయమే. ఐతే పూర్తిగా జియోకి సాయం చేస్తున్నట్లు మాత్రం కాదు,తన వేల్యూ అన్‌లాక్ చేయడం కోసమే ఇలా ఎయిర్‌టెల్ చేస్తుందని సంస్థ ఎండి,సీఈఓ గోపాల్ విఠల్ చెప్తున్నారు. టెలికాం స్పెక్ట్రమ్‌లో భారతి ఎయిర్‌టెల్ వేల్యూ ఎంతో ఈ డీల్స్‌తో తెలిసి వస్తుందంటూ చెప్పారాయన.

ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, ముంబై సర్కిల్స్‌లో తన స్పెక్ట్రమ్‌ని జియోకి రూ.1038కోట్లకు జియోకి విక్రయించనుంది. ఏపీలో 3.75మెగాహెర్ట్స్,ఢిల్లీలో 1.25 మెగాహెర్ట్స్, ముంబైలో 2.50మెగాహెర్ట్స్ మేర స్పెక్ట్రమ్‌ను అమ్మడం ద్వారా మిగిలిన స్పెక్ట్రమ్ వేల్యూ ఎంతో ఈజీగానే అర్ధమైపోతుంది. ఈ విక్రయం అంతా ట్రాయ్, టెలికాం డిపార్ట్‌మెంట్ గైడ్‌లైన్స్ ప్రకారమే జరుగుతుందని రిలయన్స్ సంస్థ కూడా ప్రకటించింది.ఐతే ఈ స్పెక్ట్రమ్ బదిలీపై తుది నిర్ణయం మాత్రం రెగ్యులేటరీ సంస్థల పరిధిలోనే ఉంది

Tags

Read MoreRead Less
Next Story