PAYTM : పేటీఎం వాడుతున్నారా.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు

PAYTM : పేటీఎం వాడుతున్నారా.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (పీపీబీఎల్‌) చర్య విషయంలో మళ్లీ రివ్యూ చేసే అవకాశం లేనేలేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. అన్ని కోణాల నుంచి ఎంతో ఆలోచించిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ ఏ ఫిన్‌టెక్‌ కంపెనీకి వ్యతిరేకం కాదని, ఆ రంగానికి మద్దతు ఇవ్వడంతో పాటు అది వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.

డిపాజిటర్లు, కస్టమర్ల ప్రయోజనాలు కాపాడడం తమ ప్రధాన బాధ్యత అని శక్తిగకాంత దాస్‌ గుర్తు చేశారు. ఏ సంస్థ అయినా నియంత్రణలను పదేపదే ఉల్లంఘిస్తూ, ఎన్నిసార్లు హెచ్చరించినా తన వైఖరి మార్చుకోని సందర్భంలో మాత్రమే ఆర్‌బీఐ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని దాస్‌ స్పష్టం చేశారు. అన్ని కోణాల నుంచి పేటీఎం వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం మాత్రమే తాము చర్య తీసుకున్నట్టు తెలిపారు.

ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పీపీబీఎల్‌ ఎలాంటి డిపాజిట్లు స్వీకరించరాదని, కస్టమర్‌ ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో టాప్‌ అప్ లు చేయరాదని ఆదేశిస్తూ జనవరి 31వ తేదీన ఆర్‌బీఐ నిషేధం విధించింది. పేటీఎంకు ఎన్నో సార్లు రూల్స్ ఉల్లంఘించిందని.. అదే స్థితి కొనసాగుతూ ఉండడంతో చర్యకు పాల్పడక తప్పలేదని క్లారిటీ ఇచ్చింది. ఆ నిర్ణయంలో మార్పు లేదని మరోసారి ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story