ఆరాధ్య బచ్చన్ సంస్కారానికి నెటిజన్స్ ఫిదా..

ఆరాధ్య బచ్చన్ సంస్కారానికి నెటిజన్స్ ఫిదా..
ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కేన్స్ నుండి ముంబైకి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారిన నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కేన్స్ నుండి ముంబైకి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారిన నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో ఆరాధ్య సంస్కారాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆరాధ్య తన తల్లి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.

ఈ వారం ప్రారంభంలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఐశ్వర్య, ఆరాధ్య ముంబై నుంచి వెళ్లారు. ఆమె చాలా సంవత్సరాలుగా ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవానికి హాజరవుతోంది. ఆరాధ్య ఏడాది కాలంగా తల్లితో పాటు ఫ్రెంచ్ రివేరియాకు వెళుతోంది.

నెటిజన్లకు ఆరాధ్య సంస్కారం నచ్చింది. ఆమెపై తమ ప్రేమను కురిపించారు. ఈ ఉత్సవానికి హాజరవడాన్ని ఆరాధ్య ఎలా ఇష్టపడుతుందో ఐశ్వర్య ఇటీవల వెల్లడించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఆరాధ్య ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో ఆరాధ్య కూడా ఇలా కేన్స్ ఫెస్టివల్ కు హాజరయ్యే అవకాశం వస్తుందని ఐశ్వర్య ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రతి పార్టీలో తన కూతురిని తన వెంటే ఉంటచుకుంటుంది ఐశ్వర్య.


Tags

Read MoreRead Less
Next Story