Bigg Boss Telugu 5: నాకు గేమ్ ఆడటం రాదు.. అదే నా దరిద్రం: షణ్ముఖ్ జస్వంత్

Bigg Boss Telugu 5: నాకు గేమ్ ఆడటం రాదు.. అదే నా దరిద్రం: షణ్ముఖ్ జస్వంత్
Bigg Boss Telugu 5: మాములు గానే తక్కువ మాట్లాడుతూ తన పనేదో తను చేసుకునే యూట్యూబర్ షణ్ణు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినా అదే ధోరణి.

మాములు గానే తక్కువ మాట్లాడుతూ తన పనేదో తను చేసుకునే యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినా అదే ధోరణి. అయినా ఎవరితో మాట్లాడితో ఏం వస్తుందో అని కామ్‌గా ఉంటాడు.. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులు కానీ, గేమ్‌లు కానీ మమ అనిపిస్తూ గట్టేక్కేస్తున్నాడు. తనని ఎలిమినేట్ చేసేంత పెద్ద సీరియస్ ఇష్యూస్ కూడా ఉండవు.

కామ్ అండ్ కూల్ గోయింగ్ పర్సన్. అందుకే బుల్లితెర ప్రేక్షకులకు షణ్ముఖ్ నచ్చుతాడేమో. తాజాగా హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక జరుగుతోంది. దాంతో హౌస్ వాతావరణం వాడి వేడిగా ఉంది. ఈ క్రమంలోనే గతవారం రోజుల నుంచి సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌మేట్స్ అందరూ ఖుషీ అయ్యారు.

ఇక రవి అయితే లోబో లేని లోటు బాగా కనిపించిందని తెగ ఫీలయ్యాడు. లోబో కనిపించగానే పరుగున వెళ్లి హగ్ చేసుకున్నాడు. విశ్వ, అనీ మాస్టర్ సైతం లోబో రాకని ఆస్వాదించారు. మరోవైపు బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో గెలుపొందడం కోసం జెస్సీ.. సిరి సాయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో వాళ్లిద్దరిపై షణ్ముఖ్ కోపంగా ఉన్నాడు. ఇంటి సభ్యులందరూ టాస్క్ సరిగా ఆడు అంటున్నారు. అందరూ నన్ను తీసిపడేస్తున్నారు. జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను మోసపోయాను.

నాకు గేమ్ ఆడడం కూడా రాదు.. అదే నా దరిద్రం.. అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి మాటలతో సిరి, జెస్సీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్-సిరి-జెస్సీల మధ్య ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story