Hansika Motwani : ప్రభాస్, అల్లు అర్జున్ లపై ఇంట్రస్టింగ్ కామెంట్స్

Hansika Motwani : ప్రభాస్, అల్లు అర్జున్ లపై ఇంట్రస్టింగ్ కామెంట్స్
ప్రభాస్, అల్లు అర్జున్‌లను ప్రశంసించిన హన్సిక.. వారిద్దరూ ఎదుగుదలకు తగినవారేనని వ్యాఖ్య

నటి హన్సిక మోత్వాని చివరిగా తమిళ చిత్రం 'పార్ట్‌నర్‌'లో కనిపించింది. ఆమె తదుపరి చిత్రం ' మై నేమ్ ఈజ్ శృతి ' తెలుగులో నవంబర్ 17న ఈరోజు థియేటర్లలో విడుదలవుతోంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆర్గాన్ అండ్ స్కిన్ మాఫియా నేపథ్యంలో సాగే థ్రిల్లర్. ఇటీవల ప్రెస్ మీట్‌లో మాట్లాడిన నటీనటులు ప్రభాస్, అల్లు అర్జున్‌లను ప్రశంసించారు. ఓ నేషనల్ మీడియా ప్రకారం, హన్సిక మోత్వాని మాట్లాడుతూ, టాలీవుడ్‌లోని ఇద్దరు ప్రముఖులు వారి సినిమాలు ఉన్న భాషాపరమైన అడ్డంకులను తొలగించినందుకు గర్వపడుతున్నానని చెప్పింది. ఆ ఇద్దరు నటులు తమ ఎదుగుదలకు తగిన అర్హత ఉందని, ఇంత గొప్ప పేరు వచ్చినా కూడా వారు నిరాడంబరంగా ఉంటారని హన్సిక చెప్పింది. తన సహనటుల పట్ల చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నానని ఆమె వెల్లడించింది.

ఇదిలా ఉండగా హన్సిక 2007లో 'దేశ ముదురు' చిత్రంతో అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇదే ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం. ఈ యాక్షన్ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో హన్సిక మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని, పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇక 2009లో విడుదలైన 'బిల్లా'లో ప్రభాస్ తో కలిసి హన్సిక నటించింది. ఈ మూవీలో ఆమె కేవలం అతిథి పాత్రలోనే నటించింది. లిమిటెడ్ స్ర్కీన్ పర్మార్మెన్స్ ను మాత్రమే ఆమె కలిగి ఉంది. ఇక ఆమె తాజా సినిమాల విషయానికొస్తే.. 3తో ఓటీటీలోకి అరంగేట్రం చేసిన హన్సిక.. నవంబర్ 17న రిలీజ్ కానున్న ' మై నేమ్ ఈజ్ శృతి ' కాకుండా, '105మినిట్స్', 'రౌడీ బేబీ', 'గార్డియన్', 'మ్యాన్' వంటి చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.




Tags

Read MoreRead Less
Next Story