భారీ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్న క్రేజీ హీరోయిన్..

భారీ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్న క్రేజీ హీరోయిన్..
సీనియర్ హీరోయిన్ అని అనుకోవడానికి లేదు. నేటి తరం హీరోయిన్లతో పోటీ పడే అందం త్రిష సొంతం..

సీనియర్ హీరోయిన్ అని అనుకోవడానికి లేదు. నేటి తరం హీరోయిన్లతో పోటీ పడే అందం త్రిష సొంతం.. రోజు రోజుకి మరింత అందంగా మారుతోంది. అందుకే దర్శకుల చూపు త్రిష వైపు మళ్లింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిషకు స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తోంది. తాజాగా విజయ్, కమల్ హాసన్ తో జోడీ కట్టనుంది. మణిరత్నంతో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. పొన్నియన్ సెల్వన్ తో తన నటనతో ఆకట్టుకున్న త్రిషను మణిరత్నం మరో ప్రాజెక్ట్ లో కూడా ఆమెనే తీసుకోనున్నట్లు సమాచారం.

దాదాపు 25 ఏళ్ల క్రితం 'జోడి' సినిమాలో గుర్తింపు లేని అతిధి పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించింది త్రిష. ఆ తరువాత అవకాశాలు వచ్చినా ఆమె కెరీర్ ముగిసిందని చాలా మంది భావించారు. ఇప్పుడు చేతిలో పెద్ద సినిమాలతో అగ్ర కథానాయికలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

విజయ్ నటిస్తున్న లియో చిత్రంలో అతడికి జోడీగా త్రిషను ఎంపిక చేశారు. కమల్ హాసన్-మణిరత్నంలతో మరో చిత్రంలో నటించేందుకు త్రిష సైన్ చేసిందట. ఇంకా అజిత్ నటిస్తున్న విడముయార్చిలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

త్రిష నటిస్తున్న చిత్రాలు.. 'ది రోడ్', రామ్ పార్ట్ 1, ఐడెంటిటీ, సతురంగ వెట్టై 2 చిత్రాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. తెలుగులో వెంకటేష్ తో నటించిన ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సీక్వెల్ చేయడానికి తాను 'సిద్ధంగా ఉన్నాను' అని సరదాగా ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దర్శకుడు కూడా ఆలోచనలో పడి త్రిష ఓకే చేసింది కదా సీక్వెల్ చేద్దామని అనుకుంటారేమో.. చూడాలి ఏం జరుగుతుందో.. తెలుగు ప్రేక్షకులు కూడా త్రిషని మరోసారి టాలీవుడ్ తెరపై చూడాలనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story