Bombay: మణిరత్నం 'బొంబాయి'లో అరవింద్ స్వామి కంటే ముందు అనుకున్న హీరో..

Bombay: మణిరత్నం బొంబాయిలో అరవింద్ స్వామి కంటే ముందు అనుకున్న హీరో..
Bombay: కొన్ని కథలు, కథలో పాత్రలు కొందరికే సూటవుతాయేమో అన్నంత బాగా నటించేస్తారు.. ఆ పాత్రకు వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేరు ప్రేక్షకులు.

Bombay: కొన్ని కథలు, కథలో పాత్రలు కొందరికే సూటవుతాయేమో అన్నంత బాగా నటించేస్తారు.. ఆ పాత్రకు వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేరు ప్రేక్షకులు. ఆ సినిమా హిట్ కొడితే ఫలానా హీరో లేదా హీరో నటించారు కాబట్టి ఆ సినిమా హిట్టైంది అనేంతగా ప్రేక్షకుల హృదయాల్లో కొన్ని సినిమాలు, పాత్రలు చెరగని ముద్ర వేస్తాయి. అలా వచ్చిందే మణిరత్నం ఎవర్ గ్రీన్ పిక్ 'బొంబాయి' సినిమా.

ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా మనీషా కోయిరాలా, అరవింద్ స్వామి నటించారు అనడంకన్నా జీవించారు అంటే బావుంటుందేమో. మణిరత్నం వారి నుంచి ఆ విధమైన ఎక్స్‌ప్రెషన్స్ రాబట్టుకున్నారు. అందుకే మణిరత్నం సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తారు. అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు నటీనటులు.

అయితే ఈ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర కోసం ముందుగా నటుడు చియాన్ విక్రమ్‌ని సంప్రదించారట మణిరత్నం. అతడికి కూడా కథ బాగా నచ్చింది. చెయ్యాలని ఉందని కూడా చెప్పాడు. కానీ అప్పటికే మరో సినిమా కోసం గడ్డం పెంచుకున్నాడు. డేట్స్ కూడా ఇచ్చి ఉన్నాడు. దాంతో బొంబాయి సినిమా అతడి చేయి జారిపోయింది.

ఆ అవకాశం అరవింద్ స్వామికి వచ్చింది. ఈ విషయం పొన్నియన్ సెల్వన్ సక్సెస్ మీట్లో విక్రమ్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని వివరించాడు. అయితే ప్రేక్షకులు మాత్రం ఆ పాత్రలో చియాన్ విక్రమ్‌ని ఊహించుకోలేకపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story