దేవర సినిమా సెట్స్‌లో జాన్వీ కపూర్ భావోద్వేగం.. తల్లిని తలుచుకుని..

దేవర సినిమా సెట్స్‌లో జాన్వీ కపూర్ భావోద్వేగం.. తల్లిని తలుచుకుని..
జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవర చిత్రం షూటింగ్‌లో ఉంది.

జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవర చిత్రం షూటింగ్‌లో ఉంది. ఈ చిత్రం ద్వారా ఆమె సౌత్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసినట్లు అవుతుంది. ఈ చితరంలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ నటిస్తోంది. తన తల్లి శ్రీదేవి నటిగా సౌత్ ఇండస్ట్రీలో ఎదిగిన వైనాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది.

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా పంచుకుంది, “ఇది నా మొదటి తెలుగు చిత్రం. నాకు భాష రాదు కాబట్టి డైలాగ్ నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇంట్లో మా అమ్మ మాతో హిందీ, ఇంగ్లీషులో మాట్లాడేది. కానీ మేం ఎప్పుడు చెన్నై వెళ్లినా ఆమె తమిళంలో మాట్లాడేది. మేం చెన్నై కూడా ఎక్కువ సార్లు వెళ్లలేదు. అయినా నాకు తెలుగు కంటే తమిళంతో కొద్దిగా పరిచయం ఉంది.

దేవర చిత్రానికి పని చేయడం కూడా ఒక విధంగా సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని జాన్వీ తెలిపారు. సెట్‌లో ఉన్నవాళ్లంతా నా వాళ్లలాగా భావిస్తున్నాను. అమ్మతో నాకున్న తీవ్రమైన ఎమోషనల్ అటాచ్‌మెంట్ వల్లనో లేక సౌత్‌లో సినిమా చేయడం వల్ల నేను ఆమెతో అటాచ్ అయ్యానో నాకు తెలియదు కానీ నాలో ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన వ్యక్తమవుతోందని జాన్వీ అన్నారు.

ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ నటిగా పూర్తి పరివర్తన చెందుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.

జాన్వీ కపూర్ చివరిసారిగా వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌లో కనిపించింది. ఆమె రూహి, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, ఘోస్ట్ స్టోరీస్, గుడ్‌లక్ జెర్రీ వంటి చిత్రాలలో నటించి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఆమె రాబోయే ప్రాజెక్ట్‌లలో దోస్తానా 2, మిస్టర్ అండ్ మిసెస్ మహి ఉన్నాయి. ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించిన ధడక్ చిత్రం ద్వారా జాన్వీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story