నవరాత్రులు.. 9 మంది హీరోయిన్లకు వైజయంతీ మూవీస్ స్పెషల్ ట్రీట్

నవరాత్రులు.. 9 మంది హీరోయిన్లకు వైజయంతీ మూవీస్ స్పెషల్ ట్రీట్
సెలక్షన్ ఎంత బావుంది.. ఆ పాత్రకు సరిగ్గా ఒదిగిపోయింది. ఏదైనా ఓ మంచి చిత్రాన్ని చూస్తే సగటు ప్రేక్షకుడుకి సైతం ఇదే ముచ్చట.

సెలక్షన్ ఎంత బావుంది.. ఆ పాత్రకు సరిగ్గా ఒదిగిపోయింది. ఏదైనా ఓ మంచి చిత్రాన్ని చూస్తే సగటు ప్రేక్షకుడుకి సైతం ఇదే ముచ్చట. టాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. ఎన్నో మంచి మంచి చిత్రాలకు ఆజ్యం పోసింది ఈ బ్యానర్.. హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంటుంది వైజయంతీ బ్యానర్ లో. ఆ మాటకొస్తే ఆ బ్యానర్ లో పనిచేయడం దాదాపుగా నటీనటులందరికీ నచ్చుతుంది. ఇక ఈ బ్యానర్ లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ సాధించినవే.

తాజాగా నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని వైజయంతీ మూవీస్ తమ సోషల్ మీడియా పేజీలో లెజెండరీ నటి శ్రీదేవి చిత్రాన్ని షేర్ చేసి, దానికి 'మా ఇంద్రజ' అనే శీర్షిక పెట్టింది. శ్రీదేవి పుట్టినరోజు కానీ, వర్ధంతి కానీ లేనప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే నవరాత్రుల సందర్భంగా వైజయంతీ మూవీస్ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది హీరోయిన్ల పోస్టర్‌లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే శ్రీదేవి, మృణాల్ ఠాకూర్‌, సౌందర్యలను, అంజలి, ఇంద్రజ, సీత అంటూ పోస్టర్లు విడుదల చేయగా, మరి కొన్ని పోస్టర్లతో రానున్నట్లు తెలుస్తోంది. ముందు వచ్చే పోస్టర్లలో కీర్తి సురేష్, నిత్యా మీనన్, మాళవిక నాయర్ ఉన్నారు. దసరా సందర్భంగా తమ కథానాయికలను ఇలా సన్మానించడం ద్వారా ప్రొడక్షన్ హౌస్ తనకు తాను సన్మానించుకున్నట్లు అయింది. వైజయంతీ మూవీస్ చర్యను అందరూ అభినందిస్తున్నారు.

మరోవైపు, జగదేక వీరుడు అతిలోక సుందరి కథ, పాత్రలపై ఎవరికీ హక్కులు లేవని ప్రొడక్షన్ హౌస్ ఇటీవల ప్రజలకు నోటీసు ఇచ్చింది. ఆ సమయంలో వారు శ్రీదేవి పేరును ప్రస్తావించారు.

Tags

Read MoreRead Less
Next Story