Prabhas, Ranbir Kapoor : రణబీర్ తో ప్రభాస్ స్ర్కీన్ షేర్..!

Prabhas, Ranbir Kapoor : రణబీర్ తో ప్రభాస్ స్ర్కీన్ షేర్..!
తొలిసారి 'డార్లింగ్' తో కలిసి నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో..!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్ కి సంబంధించిన పలు వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 'యానిమల్' ట్రైలర్‌లో పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించిన కారణంగా రణబీర్ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తున్నాడు. ట్రైలర్‌లో ఆయన లుక్స్, ఆవేశం అభిమానులను సినిమా చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. సినిమా స్టార్ తారాగణం సినిమాను ప్రమోట్ చేయడానికి ఎటువంటి ఛాన్స్ ను వదులుకోవడం లేదు. అందులో భాగంగా ఇటీవల, నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే” షోలో యానిమల్ టీమ్ కనిపించి అందర్నీ అలరించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి చిత్రంలో నటించాలని రణబీర్ కపూర్ తన కోరికను వ్యక్తం చేశాడు. 'స్పిరిట్'లో అతిధి పాత్రలో నటించడానికి ఇష్టపడతానని, అలాగే ప్రభాస్ తన స్నేహితుడని ఆయన పేర్కొన్నాడు. “సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రం ప్రభాస్ అన్నతో. అతను నా కోసం చిన్న పాత్ర చేస్తే నేను స్పిరిట్‌లో భాగం కావడానికి ఇష్టపడతాను”అని రణబీర్ అన్నాడు.

సందీప్ రెడ్డి వంగా తనకు చిన్న పాత్ర చేస్తే, స్పిరిట్‌లో నటించడానికి తప్పకుండా ఇష్టపడతానని రణబీర్ కపూర్ అన్నారు. ది స్పిరిట్ అనేది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న రాబోయే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో ప్రభాస్, కీర్తి సురేష్, కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ తదితరులు నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ ప్రస్తుతం 'యానిమల్' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద బిజినెస్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 1న ఈ మూవీ విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story