Prabhas: 'సలార్' నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్.. ఆ హీరోతో కలిసి..

Prabhas (tv5news.in)

Prabhas (tv5news.in)

Prabhas: 'కేజీఎఫ్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రభాస్ చేస్తున్న చిత్రమే సలార్

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ప్రతీ భాషలో సినిమా హిట్ అవ్వాలని ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తు్న్నారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. తన అప్‌కమింగ్ సినిమా విశేషాలను కూడా పంచుకుంటున్నాడు ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకులంతా ఆ చిత్రాలను పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నారు. అయితే వీటి కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు కూడా. ఇప్పటికే 'సలార్', 'ప్రాజెక్ట్ కె' సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌ను బ్యాక్ టు బ్యాక్ మ్యానేజ్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో ప్రభాస్.. సలార్ నుండి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.

'కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రభాస్ చేస్తున్న చిత్రమే 'సలార్'. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చినా కూడా ఇప్పటికీ దీని నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ ఉండబోతున్నాడన్న విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్.


పృథ్విరాజ్.. సలార్ సినిమాను ఒప్పుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, థాంక్స్ చెప్పాడు ప్రభాస్. అంతే కాకుండా రాధే శ్యామ్ మలయాళం వర్షన్‌కు పృథ్వి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడన్న విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. పృథ్వి సినిమాలో భాగమవుతున్నందుకు.. సలార్‌కు మలయాళంలో భారీ మార్కెట్ జరిగే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story