Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ డేట్ మార్చిన పూరీ
ఇస్మార్ట్ శంకర్.. రామ్, పూరీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మాస్ మసాలా ఎంటర్ టైనర్. రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' కమర్షియల్ గా భారీ విజయాన్ని నమోదు చేసింది. రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లని అందించిన సినిమాగా నిలిచింది.సీక్వెల్ గా రూపొందుతున్న 'డబుల్ ఇస్మార్ట్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మూవీ రిలీజ్ డేట్ మళ్లీ మార్చారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని పూరి సినిమాకి కొబ్బరికాయ కొట్టేముందే ప్రకటించారు. అయితే… పూరి లెక్క తప్పింది. అనుకొన్న సమయానికి ఈ సినిమా సిద్ధం కాలేదు.
మార్చి 8, 2024 కాకుండా జూన్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ట్రై చేస్తున్నారు. బడ్జెట్ లేక ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడటం.. నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు జరగలేదన్న అడ్డంకులను అధిగమించి షూటింగ్ పూర్తి చేస్తోంది చిత్రయూనిట్. మిగిలిన షూటింగ్ కి ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, మే కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలని పూరి భావిస్తున్నారు. మణిశర్మ పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com