పెళ్లికి పిలిచారు.. కానీ..: రేణూ దేశాయ్

పెళ్లికి పిలిచారు.. కానీ..: రేణూ దేశాయ్
ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటించారు.. ఒకరికి ఒకరు నచ్చేశారు.. ప్రేమలో పడిపోయి ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయారు...

ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటించారు.. ఒకరికి ఒకరు నచ్చేశారు.. ప్రేమలో పడిపోయి ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయారు... నవంబర్ 1న ఇటలీ వేదికగా అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. ఇప్పటికే చిరు ఫ్యామిలీ అంతా అక్కడికి చేరుకుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్లాణ్ వారి సతీమణులతో సహా విచ్చేశారు. ఇంకా హీరో నితిన్, షాలిని కూడా వీరి వివాహ వేడుకలకు హాజరయ్యారు.

నటి రేణూదేశాయ్ కూడా మెగా ఫ్యామిలీ నుంచి పెళ్లికి ఆహ్వానం అందింది.. అయితే తాను వెళితే అక్కడున్న వారంతా ఇబ్బందిగా ఫీలవుతారని అందుకే వెళ్లట్లేదని పేర్కొన్నారు రేణు.

తాను నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్ కార్యక్రమానికి విచ్చేసిన రేణూ ఒక ప్రశ్నకు సమాధానంగా వరుణ్ వివాహ ఆహ్వాన పత్రిక అందుకున్నట్లు తెలిపారు. పెళ్లికి తాను వెళ్డడం లేదని చెప్పారు. వరుణ్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, అందమైన జంట పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. నిహారిక పెళ్లికి కూడా ఆహ్వానం అందిందని, అప్పుడు తన పిల్లలను పంపానని తెలిపారు. వరుణ్ కి వివాహ శుభాకాంక్షలు అందజేశారు.

దాదాపు 20 ఏళ్ల తర్వాత నటిగా ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో రీ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్‌. రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తె.. హేమలతా లవణం పాత్ర పోషించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story