Samantha: సమంతకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన ఖుషీ టీమ్..

Samantha: సమంతకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన ఖుషీ టీమ్..
Samantha: విజయదేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ఖుషీ చిత్రం పట్టాలెక్కుతోంది.

Samantha: విజయదేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ఖుషీ చిత్రం పట్టాలెక్కుతోంది. అయితే ఉన్నట్టుండి సమంతకు అనారోగ్యం. మయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం కొన్ని రోజులు, మరికొన్ని రోజులు రెస్ట్. వెరసి చిత్రం షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఆమె చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతకంటే ఎక్కువగా చిత్ర టీమ్ ఎదురు చూసింది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని. ఇలా ఆమె కోసం వెయిట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తోంది సమంత. ఇక మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా ఖుషీ సెట్లో సమంత సందడి చేసింది. టీమ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె కోసం కేక్ తెప్పించి కట్ చేయించారు. విజయదేవరకొండతో పాటు టీమ్ అంతా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలను డైరెక్టర్ శివ నిర్వాణ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫైటర్ సమంతకు స్వాగతం.. ఇకపై అంతా మంచే జరుగుతుంది. ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం అందరికీ సంతోషదాయకం అని పోస్ట్ చేస్తూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. ఈ పోస్ట్‌ను విజయదేవరకొండకు, సమంతకు, మైత్రీ మూవీ మేకర్స్‌కు ట్యాగ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story