Manikka Vinayagam: ఇండస్ట్రీలో మరో విషాదం.. చిరంజీవి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ పాడిన గాయకుడు కన్నుమూత..

Manikka Vinayagam:  ఇండస్ట్రీలో మరో విషాదం.. చిరంజీవి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ పాడిన గాయకుడు కన్నుమూత..
Manikka Vinayagam: వివిధ భాషల్లో దాదాపు 800లకు పైగా సినిమా పాటలు పాడారు. ఆయన పాడిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

Manikka Vinayagam: ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూశారు. తమిళ చిత్రసీమలో ఈ ఏడాదిలోనే ఎందరో నటీనటులు కన్నుమూశారు. ముఖ్యంగా వివేక్, గిల్లి నటీనటులు నెల్లై శివ, నేడు ముడి వేణు, అనంత కన్నన్, నటుడు పాండు, ఎన్నడి మునియమ్మ పాట ఫేమ్ టి.కె.ఎస్.నాడరాజన్ వంటి పలువురు తమిళ సినీ ప్రముఖుల మరణం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇలాంటి పరిస్థితుల్లో గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూశారు. 57 ఏళ్ల వయసులో 2001లో విడుదలైన తమిళ చిత్రం 'దిల్'లోని 'కన్నుక్కుల్ల ఒరుతి' పాటతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఒరుతి' 'పట్టి తొట్టి' అనే హిట్ పాట తర్వాత పలు చిత్రాల్లో పాడే అవకాశం వచ్చింది.

వివిధ భాషల్లో దాదాపు 800లకు పైగా సినిమా పాటలు పాడారు. ఆయన పాడిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎమ్‌బీబీఎస్ చిత్రంలోని పట్టు పట్టు చేయ్యే పట్టు పాట పాడారు.. ఆ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.



సినిమా పాటలే కాకుండా 15 వేలకు పైగా భక్తి, జానపద పాటలు పాడారు. ప్లేబ్యాక్ సింగర్‌గానే కాకుండా పలు సినిమాల్లో నటించారు. ధనుష్ నటించిన 'తిరుడ తిరుడి' చిత్రంలో అతడి తండ్రిగా నటించారు. గాయకుడిగా అభిమానుల మనసు దోచుకున్న ఆయన తొలి సినిమాతోనే నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పలు చిత్రాల్లో విలన్‌గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. మాణిక్య వినాయగం మృతి పట్ల ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చివరిగా 2017లో విడుదలైన 'ఎయిటీ ఎయిట్' చిత్రంలో నటించారు. ఓ మంచి నటుడిని, గాయకుడిని తమిళ ఇండస్ట్రీ కోల్పోయిందని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story