Thalapathy Vijay: తండ్రీ కొడుకుల గొడవ.. మరోసారి తెరపైకి

Thalapathy Vijay: తండ్రీ కొడుకుల గొడవ.. మరోసారి తెరపైకి
Thalapathy Vijay: త‌మిళ ప‌రిశ్రమలో పాపుల‌ర్ స్టార్ విజ‌య్ తలపతి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్‌తో త‌న కెరీర్‌లో దూసుకుపోతున్నారు.

Thalapathy Vijay: త‌మిళ ప‌రిశ్రమలో పాపుల‌ర్ స్టార్ విజ‌య్ తలపతి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్‌తో త‌న కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన వారిసు కమర్షియల్‌గా విజయం సాధించింది. అయితే ఆయన వ్యక్తిగత జీవితం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా, విజయ్‌కి తన తండ్రి, సీనియర్ ఫిల్మ్ మేకర్ ఎస్‌ఎ చంద్రశేఖర్‌కు మధ్య చాలా కాలం నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశం మరోసారి తెరపైకి రావడంతో చంద్రశేఖర్ స్పందించారు.

ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ.. మా మధ్య గొడవలేమీ లేవు, సాధారణ తండ్రి-కొడుకుల మాదిరిగానే ఉన్నామని వెల్లడించారు. కొడుకు విజయ్ నటించిన తాజా చిత్రం వారిసును కుటుంబం అంతా కలిసే చూశామని వెల్లడించారు.

ఏడాదిన్న కాలంగా తమ మధ్య మాటలు లేవని, అయితే అది అంత సీరియస్ ఇష్యూ కాదని, మీడియా మాత్రం దానిమీదే ఫోకస్ చేస్తోందని అన్నారు. తండ్రీ కొడుకులు ప్రేమ, ఆప్యాయతలను బహిరంగంగా వ్యక్తం చేసుకోవాల్సిన పని లేదు.

తండ్రీ కొడుకుల బంధం అసలెందుకు వివాదమైంది..

ఆలిండియా విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను రాజకీయ పార్టీగా మార్చడానికి తండ్రి ప్రయత్నించాడు. ఇది నచ్చని విజయ్ తన తల్లిదండ్రులపై, వారిని ప్రోత్సహించిన వారిపై దావా వేశాడు. ఎస్‌ఏ చంద్రశేఖర్‌ రాజకీయ పార్టీని రిజిస్టర్‌ చేయాలని, తాను ప్రధాన కార్యదర్శిగా, విజయ్‌ తల్లి శోభా చంద్రశేఖర్‌ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టాలని యోచిస్తున్నారు. అయితే, రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశ్యం లేని నటుడు, దావా వేసిన తరువాత అధికారిక ప్రకటన విడుదల చేశాడు, తన పేరు మరియు స్టార్‌డమ్‌ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని తల్లిదండ్రులతో సహా ప్రతి ఒక్కరినీ హెచ్చరించాడు.

Tags

Read MoreRead Less
Next Story