ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచ్‌గా మారిన నటి.. ఒకప్పుడు అమీర్, సైఫ్‌లతో కలిసి..

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచ్‌గా మారిన నటి.. ఒకప్పుడు అమీర్, సైఫ్‌లతో కలిసి..
బాలీవుడ్ నటి శృతి సేథ్ సర్టిఫైడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచ్, థెరపీ ప్రాక్టీషనర్, మెంటల్ హెల్త్ అడ్వకేట్, శిక్షణ పొందిన మెడిటేషన్ టీచర్ గా మారింది.

బాలీవుడ్ నటి శృతి సేథ్ ఇప్పుడు సర్టిఫైడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచ్, థెరపీ ప్రాక్టీషనర్, మెంటల్ హెల్త్ అడ్వకేట్, శిక్షణ పొందిన మెడిటేషన్ టీచర్ గా మారింది. అమీర్ ఖాన్, రాణి ముఖర్జీతో కలిసి త ర రమ్ పమ్‌లో నటించింది. మరో సినిమా ఫనాలో అమీర్ ఖాన్, కాజోల్‌తో కలిసి పని చేసింది. 2003లో ప్రముఖ టీవీ షో శరత్‌లో ఆమె ప్రధాన పాత్రధారిణిగా ఉంది. ఆ తరువాత నటనకు దూరమై మానసిక ప్రవర్తనకు సంబంధించిన కొన్ని కోర్సులలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఆమె థెరపీ ప్రాక్టీషనర్ గా, మానసిక ఆరోగ్య శిక్షకురాలిగా పని చేస్తోంది.

లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా తన జీవితం గురించి సోషల్ మీడియాలో పంచుకుంటుంది, తన అభిమానులను అప్‌డేట్ చేస్తుంది. శృతికి ఇన్‌స్టాగ్రామ్‌లో 500,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవలి పోస్ట్ ప్రకారం.. సవాళ్లను అధిగమించడానికి, లక్ష్యాలను సాధించడానికి మహిళలకు మద్దతు ఇవ్వడానికి ఆమె కోటో సంఘంలో సభ్యత్వం తీసుకుంది.

2023 అక్టోబర్ 3వ తేదీన ఢిల్లీలోని AIIMSలో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య ఉత్సవంలో పాల్గొననుంది. శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేరణాత్మక సందేశాలను పంచుకుంటుంది. శృతి సేథ్ బొంబాయిలోని తాజ్ మహల్ హోటల్‌లో గెస్ట్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తరువాత, ఆమె శరరత్‌లో ఒక పాత్ర కోసం ఆడిషన్ చేయబడింది ఫరీదా జలాల్ మరియు ఎవా గ్రోవర్‌లతో కలిసి నటించిన షోలో ప్రధాన నటిగా మారింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. తరువాత, ఆమె క్యున్ హోతా హై ప్యార్ర్, దేస్ మే నిక్లా హోగా చంద్, రిష్తా.కామ్‌లలో కనిపించింది.

ఆమె త ర రమ్ పమ్ మరియు ఫనాతో సహా కొన్ని చిత్రాలలో నటించింది. ఒక ఇంటర్వ్యూలో, టీవీ నుండి సినిమాకి వెళ్లడం గురించి మాట్లాడుతూ, “నేను నిజంగా దేని కోసం ప్రయత్నించలేదు. అవకాశాలు అవే వచ్చాయి. వచ్చిన వాటిని చేసుకుంటూ వెళ్లాను. నటిగానే కాదు నా కోసం మరో మార్గం కూడా తెరిచి ఉందని భావించాను. అందుకే ఇటు వైపు వచ్చాను. ఎమోషనల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఎందరి జీవితాలనో తీర్చి దిద్దవచ్చు. ఇందులో మానసిక సంతృప్తి కలుగుతుంది అని శృతి తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story