Uttej: టాలీవుడ్లో విషాదం.. నటుడి భార్య మరణం..
Uttej: టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో మరణించారు.
పద్మ మరణవార్త అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, జీవిత, ఇతర టాలీవుడ్ నటులు ఉత్తేజ్ ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి ఉత్తేజ్ని అతని కుమార్తెను ఓదార్చారు. ఉత్తేజ్ తన భార్య మరణంతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాడు.
ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి పాలుపంచుకునేవారు. ఉత్తేజ్కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com