వెలుగులోకి నిత్య పెళ్లి కూతురి మోసాలు.. బంగారం, డబ్బులతో జంప్..!

వెలుగులోకి నిత్య పెళ్లి కూతురి మోసాలు.. బంగారం, డబ్బులతో జంప్..!
విశాఖలో నిత్య పెళ్లి కూతురి మోసాలు వెలుగులోకి వచ్చాయి. యువకులను మోసం చేసి పెళ్లి చేసుకొని.. అనంతరం డబ్బులు, నగదుతో ఉడాయిస్తోందో కిలాడి.

విశాఖలో నిత్య పెళ్లి కూతురి మోసాలు వెలుగులోకి వచ్చాయి. యువకులను మోసం చేసి పెళ్లి చేసుకొని.. అనంతరం డబ్బులు, నగదుతో ఉడాయిస్తోందో కిలాడి. గాజువాకకు చెందిన ప్రసాద్ అనే ఇండియన్ ఆర్మీ ఉద్యోగిని ఓ యువతి మూడో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం గతేడాది ఇరువురు లక్నోకు వెళ్లిపోయారు. అక్కడ ప్రసాద్‌తో బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనిపించుకుని.. పలు దఫాలుగా 90 లక్షల వరకు కాజేసింది. కొట్టేసిన నగలు, సొమ్ముతో గాజువాక తిరిగొచ్చేసింది. అయితే తిరిగి లక్నోకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతను.. గాజువాకకు వచ్చి ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది. యువతి అప్పటికే ఇద్దరు యువకులను పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు గుర్తించారు. దీంతో మోసపోయామని గ్రహించిన ప్రసాద్ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story