Crime : నవీన్‌ హత్యకు మూడు నెలలుగా ప్లాన్

Crime : నవీన్‌ హత్యకు మూడు నెలలుగా ప్లాన్
స్నేహితుడిని చంపి, గుండె కోసి యువతికి ఫోటోలు పంపాడు. వెరీగుడ్‌ అంటూ ఆ యువతి రిప్లై ఇచ్చింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. మూడు నెలలుగా నవీన్‌ హత్యకు ప్లాన్‌ చేసి.. సమయం కోసం హరిహరకృష్ణ వేచిచూశాడు. కొన్ని కారణాలతో యువతి తనకు దూరమైందని.. దీన్ని నవీన్‌ అనుకూలంగా మార్చుకుని యువతిని ప్రేమించాడని హరిహర పోలీసులకు తెలిపాడు. యువతి కూడా నవీన్‌తో క్లోజ్‌గా మెలిగిందని.. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తట్టుకోలేకపోయానని వెల్లడించాడు.

ఫిబ్రవరి 17న నవీన్‌ను ఎల్బీనగర్‌లో కలిసినట్లు హరిహర పోలీసులకు తెలిపాడు. పెద్దఅంబర్‌పేట్‌ వద్ద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నవీన్‌పై కత్తితో దాడి చేశాడు హరిహర. దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. స్నేహితుడిని చంపి, గుండె కోసి యువతికి ఫోటోలు పంపాడు. వెరీగుడ్‌ అంటూ ఆ యువతి రిప్లై ఇచ్చింది. ఆమె వ్యవహారంపైనా పోలీసులు విచారణ చేపట్టారు. హరిహర కృష్ణ ఒక సైకో అని తెలుస్తోంది.

మూసారాంబాగ్‌కు చెందిన హరిహరకృష్ణ, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన నవీన్‌.. నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. వారిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో కొన్నాళ్లుగా ఇద్దరికీ భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నవీన్‌ దారుణహత్యకు గురయ్యాడు.

హత్య ఎక్కడ జరిగింది? ఎవరెవరు ఇందులో భాగం పంచుకున్నారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు.. అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌ వద్ద మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కుమారుడు లేడన్న వార్త తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story