నెల్లూరులో విషాదం.. లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు
By - Nagesh Swarna |30 Jan 2021 7:13 AM GMT
ఒకే తాడుతో ఉరివేసుకుని చనిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది.
నెల్లూరు నగరం పడారుపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఓ లాడ్జిలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే తాడుతో ఉరివేసుకుని చనిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు వేదాయపాలెం పోలీసులు. వీరిద్దరూ చిట్టమూరు మండలంలోని మెట్టులో సచివాలయ ఉద్యోగులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com