ధూల్పేటలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి..!
By - Gunnesh UV |10 Aug 2021 3:15 PM GMT
హైదరాబాద్ ధూల్పేటలో గ్యాస్ సిలిండర్ పేలింది. గోదాంలో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు.
హైదరాబాద్ ధూల్పేటలో గ్యాస్ సిలిండర్ పేలింది. గోదాంలో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మృతుల్లో మానవ సింగ్(24), నీరజ్ సింగ్(48) ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు.. ఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేలుడుకు గల కారణాలను ఆరా తీశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com