Hyderabad: జూనియర్ ఆర్టిస్ట్ మృతి.. రైలెక్కుతూ పట్టుతప్పి పట్టాలపై..

Hyderabad: జూనియర్ ఆర్టిస్ట్ మృతి.. రైలెక్కుతూ పట్టుతప్పి పట్టాలపై..
Hyderabad: నిద్రమత్తులో ఉన్న జ్యోతి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకుని షాద్‌నగర్ స్టేషన్‌లో దిగింది.

Hyderabad: జూనియర్ ఆర్టిస్ట్ మృతి.. రైలెక్కుతూ పట్టుతప్పి పట్టాలపై..రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ స్టేషన్‌లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన బట్టినపాత జ్యోతి (26) హెచ్‌బీఎప్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్ట్‌గాను అప్పుడప్పుడు వచ్చిన అవకాశాలను వినియోగించుకునేది.

సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో చేసుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ నగరానికి తిరుగు ప్రయాణం అయింది వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకుని షాద్‌నగర్ స్టేషన్‌లో దిగింది.

వెంటనే తేరుకుని మళ్లీ రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే రైలు కదులుతుండడంతో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story