Manneguda Kidnap Case: నవీన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు కీలక అంశాలు

Manneguda Kidnap Case: నవీన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు కీలక అంశాలు
Manneguda Kidnap Case: మన్నెగూడ కిడ్నాప్‌కేసు నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఇవాళ ఇబ్రహీంపట్నం కోర్టులో విచారణ జరుగనుంది.

Manneguda Kidnap Case: మన్నెగూడ కిడ్నాప్‌ కేసు నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఇవాళ ఇబ్రహీంపట్నం కోర్టులో విచారణ జరుగనుంది. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి తో పాటు మరో నలుగురు నిందితులను వారం రోజులపాటు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు లోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.


ఇప్పటికే నిందితుడు నవీన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ నిరాకరించినందునే వైశాలిని వేధించినట్లు అతడు అంగీకరించాడు. ఆమె తన ప్రేమను నిరాకరించడంతో వైశాలిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో వేధింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.


ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫొటోలు, వీడియోలు పెట్టడంతో పాటు ఆమె ఇంటి ముందు ల్యాండ్ తీసుకుని షెడ్ వేశానని నవీన్ రెడ్డి చెప్పాడు. వైశాలికి నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకున్న తాను తన వద్ద పని చేసే వారందరిని తీసుకెళ్లి ఆమె కుటుంబసభ్యులపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు అంగీకరించాడు.

నవీన్‌రెడ్డితోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు.. చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు, ప్రవీణ్‌, ప్రకాశ్‌, యశ్వంత్‌, మహేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 39 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా రూమన్‌, పవన్‌ అనే మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నవీన్‌రెడ్డిపై మొత్తం 4 కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story