Pune Crime News: ప్రేమ పేరుతో వెంటపడి.. ప్రేమించట్లేదని నడిరోడ్డు మీద..

Pune Crime News: ప్రేమ పేరుతో వెంటపడి.. ప్రేమించట్లేదని నడిరోడ్డు మీద..
Pune Crime News: ఆమె తన స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ వస్తోంది. ముగ్గురు నిందితులు బైక్‌పై వచ్చి వారిని వెంబడించారు.

Pune Crime News: 22 ఏళ్ల నిందితుడు బాలికకు దూరపు బంధువు అని, ఆమె ఇంట్లో ఉండేవాడని పోలీసులు తెలిపారు. పూణేలోని ఒక వీధిలో 14 ఏళ్ల బాలిక కబడ్డీ ప్రాక్టీస్‌కి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు మైనర్లు ఆమెను దారుణంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.

8వ తరగతి చదివే బాలికను దగ్గర బంధువు ప్రేమించమంటూ వెంట పడ్డాడు. ఆ అమ్మాయి తనకు అలాంటివన్నీ నచ్చవని చెప్పినా వినిపించుకోలేదు. కాళ్లా వేళ్లా పడుతున్నా కాదంటవా అని కాపు కాసి వేటు వేశాడు.. నిష్కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు.. స్నేహితులతో కలిసి నడిరోడ్డు మీద బాలికను హత్య చేశాడు.

సంఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత మైనర్లుగా ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక సాయంత్రం 5.45 గంటల సమయంలో బీబేవాడి ప్రాంతంలోని యష్ లాన్స్‌లో కబడ్డీ ప్రాక్టీస్‌కి వెళుతోంది. ఆమె తన స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ వస్తోంది. ముగ్గురు నిందితులు బైక్‌పై వచ్చి వారిని వెంబడించారు. వారిలో ఒకరు మోటార్‌బైక్‌పై ఉండగా మరో ఇద్దరు ఆమెపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు.

వారు ఆమె గొంతు, శరీరంలోని ఇతర భాగాలలో అనేకసార్లు పొడవడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. ఆమెను చంపిన తర్వాత ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మైనర్ అయిన ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలియజేశారు.

22 ఏళ్ల నిందితుడు శుభమ్ భగవత్, బాలికకు దూరపు బంధువు. బాలిక ఇంట్లోనే ఉండేవాడు. అతడు బాలిక పట్ల ప్రేమను పెంచుకుంటున్నాడని తెలిసి అమ్మాయి తల్లిదండ్రులతో సహా ఆమె కూడా అతడిని దూరం పెట్టింది. ఆమె తల్లిదండ్రులు అతడిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని కూడా చెప్పారు.

నడిరోడ్డుపై జరిగిన ఈ క్రూరమైన చర్యను ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఖండించారు. ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story