Shocking : మైనర్ బాలికపై అత్యాచారం.. ఆత్మహత్య..

Shocking : మైనర్ బాలికపై అత్యాచారం.. ఆత్మహత్య..

కర్ణాటకలోని (Karnataka) మాండ్య జిల్లాలో (Mandya District) ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు సమాచారం. అత్యాచారం తర్వాత ఆమె గర్భం దాల్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆమె గర్భవతి అని తెలియగానే ఆత్మహత్య చేసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మైనర్ అని, కేవలం 15 ఏళ్లు మాత్రమేనని మండ్య ఎస్పీ ఎన్.యతీష్ తెలిపారు. విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం తర్వాత ఆమె షాక్‌కు గురైందని, ఆ సమయంలో ఆమె గర్భవతి అని తెలియగానే ఒత్తిడి పెరిగిందని బంధువులు చెబుతున్నారు.

రోజూలానే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చాలా బాధగా అనిపించింది. ఏమి అడిగినా సమాధానం చెప్పకుండా కూచుంది. ఒంట్లో నలతగా ఉందేమో అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని వారు ఊహించలేకపోయారు. సరిగ్గా భోజనం కూడా చేయలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆమె తన గదిలో పడుకోవడానికి వెళ్ళింది. ఉదయం గది నుంచి బయటకు రాకపోవడంతో బంధువులు కిటికీలోంచి బయటకు చూశారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న విద్యార్థి మృతదేహం ఉంది.

పొరుగింటిలో ఉండే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసినట్లు బంధువులు చెబుతున్నారు. . అత్యాచారం తర్వాత ఆ వ్యక్తి పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి మొబైల్‌ ఫోన్‌పై నిఘా పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story