దారుణం: హత్య చేసి ఏక్సిడెంట్ గా చూపించాలని..

దారుణం: హత్య చేసి ఏక్సిడెంట్ గా చూపించాలని..

కామారెడ్డి జిల్లా(kamareddy district) తాడ్వాయి మండలంలో(Tadvai Mandal) జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. హత్యను ట్రాఫిక్ ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ట్రాఫిక్ ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు (police case)నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండలానికి చెందిన ముదం శంకర్ (42) అనే వ్యక్తి ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. హత్య చేసి మృతదేహాన్ని సోలార్ ప్లాంట్(solar plant) దగ్గర వదిలేశారు. మృతదేహంపై సైకిల్‌ను ఉంచారు. పథకం ప్రకారమే గూండాలు శంకర్ తలపై బలమైన కర్రతో కొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రక్తపు మరకల ఆనవాళ్లను చూసి శివారు బ్రహ్మాజీ వాడి సోమారం తండాకు చెందిన జాత్యా నాయక్‌ను హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేసినట్లు గుర్తించారు. ముదం శంకర్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కూతురు రాధిక ఉంది. ఘటనా స్థలాన్ని ఇన్‌ఛార్జ్‌ ఐసీ శ్రీనివాసరెడ్డి(incharge ic srinivasareddy) పరిశీలించారు. శంకర్‌ను హత్య చేసిన గూండాలను కఠినంగా శిక్షించాలని తాడ్వాయి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ముదం శంకర్ మృదుస్వభావి.. వివాదాలకు దూరంగా ఉండేవారని గ్రామస్తులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story