పెట్రోల్‌ బంక్‌పై రాళ్ల దాడి

పెట్రోల్‌ బంక్‌పై రాళ్ల దాడి
అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై రాళ్లతో దాడి చేసి చంపేస్తామని బెదిరించారని అన్నారు

హైదరాబాద్‌ కూకట్‌ పల్లిలోని మంజుష హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బంక్‌లో కల్తీ పెట్రోల్‌ పోస్తున్నారని హంగామా సృష్టించారు. ముందుగా ఇద్దరు వ్యక్తులు వాటర్‌ బాటిల్‌లో నీళ్లు పోసుకుని వచ్చి తమ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్నారని బంక్‌ యజమాని మంజుష తెలిపారు. కల్తీ పెట్రోల్‌ అమ్ముతున్నామని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిబ్బందితో గొడవ పడి యువకులు.. ఫోన్‌ చేసి మరో 10మందిని పిలిపించారని చెప్పారు. అంతా కలిసి తమ సిబ్బందిపై దాడి చేశారని అన్నారు. ఇక అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై రాళ్లతో దాడి చేసి చంపేస్తామని బెదిరించారని మంజూష అన్నారు. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది ఉండే రూమ్‌ను ధ్వంసం చేశారని.. నిందితుల దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయన్నారు. ఇక కూకట్‌పల్లి పీఎస్‌లో పని చేసే కానిస్టేబుల్‌ వెంకటాచారి సైతం తమ సిబ్బందిపై బెదిరింపులకు దిగారని ఆరోపించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story