Crime News: శాడిస్ట్ మేనమామ.. కోర్కె తీర్చలేదని నోట్లో యాసిడ్ పోసి..
Crime News: అమ్మకు సోదరుడు మేనమామ.. నాన్న దగ్గర దొరికినంత రక్షణ, అంతకంటే ఎక్కువ ప్రేమా, ఆప్యాయతలు దొరుకుతాయని అనుకుంటారు అభం శుభం తెలియని చిన్నారులు.. కానీ అతడి కళ్లు కామంతో నిండిపోయిన విషయం అటు అమ్మకానీ, ఇటు అమ్మాయికానీ గ్రహించలేకపోయారు. ఫలితంగా అతడి చెర నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓడిపోయింది. మూడు నెలలు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ముందు కొడుకు పుట్టాడు.. 18 ఏళ్ల వయసులో అతడు మృతి చెందాడు. ఆ తర్వాత చాలా కాలానికి వారికి పాప పుట్టింది. ఆమెను ప్రేమగా పెంచుకున్నారు దంపతులు.
గత ఏడాది సెప్టెంబరు 5న కుటుంబసభ్యులు నెల్లూరు వెళ్లగా బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా భావించిన మేనమామ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించే క్రమంలో బాత్రూమ్లోకి వెళ్లి డోర్ బోల్ట్ పెట్టింది. అయినా అతడు వెంటపడి తలుపులు పగలగొట్టాడు.. బాలిక కేకలు వేయకుండా అక్కడే ఉన్న యాసిడ్ను ఆమె నోట్లో పోశాడు.
దీంతో ఆ చిన్నారి బాధతో కేకలు వేసింది. గమనించిన ఇరుగుపొరుగు వారు బాలికను హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com