YS Jagan : నేడు సీబీఐ కోర్టులో జగన్‌ ఆస్తుల కేసు విచారణ..!

YS Jagan : నేడు సీబీఐ కోర్టులో జగన్‌ ఆస్తుల కేసు విచారణ..!
YS Jagan : జగన్‌ ఆస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్​పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.

YS Jagan : జగన్‌ ఆస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్​పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. రఘురామ, జగన్‌ల తరపున ఇప్పటికే లాయర్లు వాదనలు వినిపించటంతో పాటు కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. ఈ కేసులో సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ అంటున్నారు. అయితే ఎలాంటి షరతులను తాము ఉల్లంఘించలేదని సీఎం తరపున లాయర్‌ కోర్టుకు తెలిపారు.

ఈ కేసులో నేడు సీబీఐ తన వాదనలను సమర్పించనుంది. తాము వాదించేదేమీ లేదని.. విచక్షణ మేరకు చట్టప్రకారం పిటిషన్​లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ పేర్కొంది. అయితే తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని.. పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన సీబీఐ కోర్టు నేటికి వాయిదా వేసింది. ఇవాళ సీబీఐ ఏం చెప్పబోతోందనేది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story