పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 125 మంది మృతి

పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 125 మంది మృతి
పాకిస్థాన్‌ను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి.

పాకిస్థాన్‌ను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక నగరాలు జలమయమయ్యాయి. అలుపెరగని వర్షాలతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది 125 మంది మృతి చెందారు. రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో 43 మంది, సింధ్‌లో 34 మంది, బలూచిస్తాన్‌లో 17 మంది, పంజాబ్‌లో 14 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో 11 మంది మృతి చెందారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మృతులలో భారీ సంఖ్యలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నట్టు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story