భార్యకి అగ్నిపరీక్ష.. సలసల కాగే నూనెలో.. !

నేటి ఆధునిక కాలంలో కూడా భార్యను అవమానిస్తూ శీలపరీక్ష చేశాడు పెట్టాడు ఓ ప్రబుద్దుడు.. ఇక వివరాల్లోకి వెళ్తే... ఈ ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా పరాండలోని కచాపురి చౌక్లో చోటుచేసుకుంది. ఈ నెల (ఫిబ్రవరి) 11వ తేదీన ఇద్దరున భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త పైన కోపంతో భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నాలుగురోజుల వరకు రాలేదు.. కారు డ్రైవరైన ఆమె భర్త.. ఆమె కోసం నాలుగు రోజులు గాలించాడు.. అయినప్పటికీ ఆమె జాడ లభించలేదు.. అయితే ఐదో రోజు మాత్రం ఆ భార్యే ఫోన్ చేసి ఇంటికి వచ్చింది. అలా ఇంటికొచ్చిన భార్యను ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ్ అని అడగగా ఆమె జరిగింది చెప్పింది.
గొడవ జరిగిన తర్వాత కచాపురి చౌక్లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా... తనని ఇద్దరి వ్యక్తులు బైక్ పైన వచ్చి బలవంతగా తీసుకువెళ్ళారని, అక్కడ వారి వద్దే నాలుగు రోజులు ఉంచుకున్నారని.. తనను ఏమీ చేయలేదని చెప్పింది. అక్కడినుంచి పారిపోయి ఇంటికి వచ్చినట్టుగా భర్తతో చెప్పింది. అయితే ఆమె చెప్పింది నమ్మని ఆ భర్త.. తమ (పర్ది) సంప్రదాయం ప్రకారం భార్య పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అనుకున్నాడు. ఈ మేరకు సలసల కాగే నూనెలో ఐదు రూపాయల బిళ్ల వేసి దాన్ని చేతితో తీయాలని పరీక్ష పెట్టాడు. భర్త ఆజ్ఞ మేరకు ఆమె కాగె నూనెలో వేసిన నాణేన్ని చేతితో తీసేందుకు ప్రయత్నించగా ఆమె చేతికి గాయాలయ్యాయి.
అయితే దినంతా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఆమె భర్త.. ఆమె చెప్పేది తను నమ్మనని, ఆమె నిజం చెబుతుందో.. అబద్ధం చెబుతుందో తెలుసుకోవాలనుకుని అలా చేసినట్లుగా ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఆమె తప్పు చేస్తే చేతులు, కాళ్లు కాలిపోతాయని అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, మహిళ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Nashik , It has been revealed that the same caste panchayat has ruled that a woman with suspicion should be boiled in boiling oil.
— BHARAT GHANDAT (@BHARATGHANDAT2) February 20, 2021
The husband took a video of the incident and made it viral. pic.twitter.com/eUz5bTmKbp
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com