వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక చిట్టంపల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఐదుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలను ఎక్కించుకుని రోడ్డుపై వేచి ఉన్న ఆటోను.. లారీ, బస్సు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్ఠలిలో నలుగురు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయారు. మంచు పడుతున్న కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
మృతులను శేణీబాయి (55), సంధ్య (18), నితిన్ (15), సోనాబాయి (15) గా గుర్తించారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com