anchor jhansi : ఇద్దరు పిల్లల్ని దత్తత.. వాళ్లిద్దరూ ఇప్పుడు..

anchor jhansi : ఇద్దరు పిల్లల్ని దత్తత.. వాళ్లిద్దరూ ఇప్పుడు..
anchor jhansi : ఆమెకు సినిమాల్లోకి రావాలని ఆసక్తి ఉంటే తాను అడ్డు చెప్పనని తెలిపింది

Anchor Jhansi: బుల్లి తెరపై యాంకర్‌గా రంగ ప్రవేశం, చేసి అడపా దడపా సినిమాల్లో వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ ఝాన్సీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. తాజాగా మా టీవీలో స్టార్ మా పరివార్ సీజన్ 3 మొదలైంది. ఆ కార్యక్రమానికి ఝాన్సీ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో స్టార్‌మాలో వచ్చే 16 సీరియల్స్‌లోని నటీనటులతో ఝాన్సీ సందడి చేస్తుంది.

చాలా రోజుల తరువాత ఓ ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేస్తు్న్నా తనదైన స్టెల్లో మాట్లాడుతూ బుల్లి తెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంలోనే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. మల్లేశం సినిమా చేస్తున్నప్పుడు చేనేత కార్మికుల కష్టాలను దగ్గరుండి చూశాను.

దాంతో అప్పటి నుంచి చేనేత వస్త్రాలు ధరించడానికే ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పింది. అనంతరం తన అలవాట్ల గురించి మాట్లాడుతూ, రాగి సంకటి, జొన్న అన్నం, పచ్చి పులుసు,చద్ది అన్నం వంటి వాటిని తినడానికి ఇష్టపడతానని చెప్పింది. ఇక రాత్రి పూట ఎక్కువగా పళ్ల రసాలు తీసుకుంటానని చెప్పింది.

ఇక తన కూతురు ధన్య గురించి చెబుతూ.. ఢిల్లీలో బయోటిక్ టెక్నాలజీలో రీసెర్చ్ చేస్తుందని, ఆమెకు సినిమాల్లోకి రావాలని ఆసక్తి ఉంటే తాను అడ్డు చెప్పనని తెలిపింది. అయితే తన కూతురు శాస్త్రవేత్త కావాలనుకుంటుందని చెప్పుకొచ్చింది ఝాన్సీ.

అలాగే తాను ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నానని తెలిపింది. వాళ్లిద్దరు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్లయ్యారు. అబ్బాయి క్రీడాకారుడిగా, అమ్మాయి కాలేజీ టాపర్‌గా ఉన్నారని చెప్పింది. వాళ్ల పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేదని, వాళ్లిద్దరు జీవితంలో స్థిరపడ్డారని, అది తనకెంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంది ఝాన్సీ.

Tags

Read MoreRead Less
Next Story